sai dharam tej: మొత్తానికి నాని 'చిత్రలహరి' తేజు చెంతకి చేరింది!

  • కిశోర్ తిరుమలతో తేజు 
  • ప్రేమకథా నేపథ్యంలో సాగే సినిమా  
  • త్వరలోనే సెట్స్ పైకి

హీరో నానితో దర్శకుడు కిషోర్ తిరుమల ఒక రొమాంటిక్ లవ్ స్టోరీని చేయాలనుకున్నాడు. ఫస్టాఫ్ చాలా బాగుందని చెప్పిన నాని, సెకండాఫ్ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేశాడు. మార్పులు చేర్పులు చేయడానికి కిషోర్ తిరుమల ప్రయత్నించినా నానిలో ఆ అసంతృప్తి అలా ఉండిపోయింది. దాంతో ఆ కథ సాయిధరమ్ తేజ్ దగ్గరికి వెళ్లినట్టుగా వార్తలు వచ్చాయి.

ఇప్పుడు ఈ కథకి సాయిధరమ్ తేజ్ ఓకే చెప్పేశాడనేది తాజా సమాచారం. ఈ కథ నచ్చిందని సాయిధరమ్ తేజ్ చెప్పడంతో, వచ్చేనెలలో సెట్స్ పైకి వెళ్లడానికి కిషోర్ తిరుమల సన్నాహాలు చేసుకుంటున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే ఈ సినిమాతో పాటు, గీతా ఆర్ట్స్ బ్యానర్లో మారుతి దర్శకత్వంలోను సాయిధరమ్ తేజ్ ఒక సినిమా చేయనున్నాడు. ఇక ఆయన తాజా చిత్రంగా 'తేజ్ ఐ లవ్ యూ' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.       

More Telugu News