nikhil: నిర్మాత దొరికేశాడు .. త్వరలో సెట్స్ పైకి 'కార్తికేయ 2'

  • గతంలో హిట్ కొట్టిన 'కార్తికేయ'
  • ఆలయం చుట్టూ తిరిగే కథ
  • సీక్వెల్ కి సన్నాహాలు

చందూ మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా కొంతకాలం క్రితం వచ్చిన 'కార్తికేయ' ఘన విజయాన్ని అందుకుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. నిఖిల్ కెరియర్లో చెప్పుకోదగిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అలాంటి ఈ సినిమాకి అప్పటి నుంచి సీక్వెల్ చేయడానికి దర్శకుడు .. హీరో ఇద్దరూ ట్రై చేస్తూనే వున్నారు గానీ కుదరలేదు.

ఈ సినిమాకి నిర్మాత దొరికాడనేది తాజా సమాచారం. ఏసియన్ సునీల్ నిర్మాణ రంగంలోకి వస్తున్నారు. 'కార్తికేయ 2' ను నిర్మించడానికి ఆయన ముందుకు రావడంతో, చందూ మొండేటి .. నిఖిల్ ఖుషీ అవుతున్నారు. వీరిద్దరూ ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్టులను పూర్తిచేసి, ఈ సీక్వెల్ ను పట్టాలెక్కించనున్నారు. ఈ ప్రాజెక్టు తరువాత శేఖర్ కమ్ముల .. నాని కాంబినేషన్లో ఏసియన్ సునీల్ ఓ సినిమా చేయనున్నాడని సమాచారం.      

More Telugu News