ramya: మోదీపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసిన హీరోయిన్ రమ్య

  • పేటీఎం పేరుతో మీ డబ్బు మోదీ జేబులోకి వెళ్తుంది
  • అలాగే మీ డేటా మొత్తం బీజేపీకి తరలిపోతుంది
  • మోదీపై ట్వీట్ చేసిన రమ్య

ఏ చిన్న అవకాశం దొరికినా ప్రధాని మోదీపై విరుచుకుపడే కర్ణాటక మండ్య మాజీ ఎంపీ, హీరోయిన్ రమ్య మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. పేటీఎం అంటే 'పే టు మోదీ' అని కొత్త భాష్యం చెప్పింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేసింది. మోదీకి డబ్బు చెల్లించండి (పే టు మోదీ కరో) అంటూ ట్యాగ్ లైన్ జత చేసింది.

పేటీఎం పేరుతో మీ డబ్బు మోదీ జేబులోకి వెళ్తున్నట్టే... ఆ యాప్ ద్వారా మీ డేటా మొత్తం బీజేపీకి తరలిపోతోంది అంటూ వ్యాఖ్యానించింది. మరోవైపు పేటీఎంతో మోదీకి లింక్ పెట్టి ట్వీట్ చేయడం పట్ల రమ్యపై బీజేపీ మద్దతుదారులు మండిపడుతున్నారు. ఓ వ్యక్తి (రాహుల్ గాంధీ) కోసం నౌకరీ, చాకిరీ చేస్తున్న మీ వైఖరిని మార్చుకోండని ఓ నెటిజన్ సలహా ఇచ్చాడు. మన డేటా వాటికన్ కు తరలిపోవడం కంటే బీజేపీ చేతిలోకి వెళ్లడమే బెటర్ అంటూ మరో నెటిజన్ స్పందించాడు. 

More Telugu News