savithri: పెళ్లి విషయంలో సావిత్రి నా మాట కూడా వినలేదు: చిన్ననాటి స్నేహితురాలు సుశీల

  • జెమినీతో పెళ్లి వద్దని అంతా చెప్పారు 
  • సావిత్రితో గల స్నేహం కారణంగా నేనూ అదే చెప్పాను 
  • ఆమె వినిపించుకునే పరిస్థితుల్లో లేదు    

తెలుగు .. తమిళ భాషల్లో సావిత్రికి ఇప్పటికీ ఎంతోమంది అభిమానులు వున్నారు. ఈ రెండు భాషల్లో ఆమె జీవితచరిత్ర తెరకెక్కడంతో, అంతా ఆమె గురించే మాట్లాడుకుంటున్నారు. 'మహానటి' సినిమాలో సావిత్రి చిన్ననాటి స్నేహితురాలిగా సుశీల పాత్ర కనిపిస్తుంది. ఆ సుశీల ఇప్పుడు ఎక్కడ ఉందోనని చాలామంది అనుకుంటున్నారు. ప్రస్తుతం విజయవాడలోనే ఉంటోన్న ఆమె, తాజాగా 'వనిత' టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను గురించి ప్రస్తావించారు."జెమినీ గణేశన్ ను సావిత్రి వివాహం చేసుకోబోతోందనే విషయం మా అందరికీ ముందుగానే తెలుసు. ఎన్టీ రామారావుగారు .. అక్కినేని నాగేశ్వరరావు గారు .. అంతా కూడా జెమినీ గణేశన్ ను పెళ్లి చేసుకోవద్దని ఎంతగానో చెప్పారు. స్నేహితులు .. బంధువులు కూడా అదేమాట చెప్పారు. చివరిగా సావిత్రి నన్ను అడిగితే, జెమినీ గణేశన్ కి ఇంతకుముందే పెళ్లి అయింది .. పిల్లలు వున్నారు .. అలాంటి ఆయనను పెళ్లి చేసుకోకపోవడమే మంచిది అని నేను చెప్పాను. అయినా తాను వినిపించుకోలేదు" అంటూ చెప్పుకొచ్చారు.

More Telugu News