Pawan Kalyan: ఈ కొబ్బరి బోండం మన పలాసది.. బండిలో పెట్టండి.. దారిలో తాగుతా!: పవన్ కల్యాణ్

  • పలాస సభలో పవన్ కు కొబ్బరిబోండమిచ్చిన అభిమానులు
  • విదేశీ పానీయాలు ఏం దాహం తీర్చుతాయి!
  • ఇది కదా దాహం తీర్చేది: పవన్

ఆంధ్రప్రదేశ్‌పై కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు శ్రీకాకుళం జిల్లా పలాసలో నిరసన కవాతు నిర్వహించిన విషయం తెలిసిందే. స్థానిక హరిశంకర్ థియేటర్ నుంచి కాశిబుగ్గ బస్టాండ్ వరకు జరిగిన ఈ కవాతు అనంతరం బహిరంగ సభలో పవన్ కల్యాణ్‌ ప్రసంగిస్తున్న సమయంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది.

ఆ వేదిక వద్ద ఉన్న అభిమానులు పవన్ కు కొబ్బరిబోండం అందజేసి తాగాల్సిందిగా కోరారు. దీంతో, ఆ కొబ్బరిబోండం అందుకున్న పవన్, ‘ఈ కొబ్బరిబోండం మన పలాసది. విదేశీ పానీయాలు ఏం దాహం తీర్చుతాయి! ఇది కదా దాహం తీర్చేది. మన కొబ్బరినీళ్లు..మన పలాస బోండం తీరుస్తుంది దాహం..బండిలో పెట్టండి.. దారిలో తాగుతాను’ అంటూ ఆ బోండాన్ని తన సహచరులకు అందజేశారు. అయితే, ఈలోగా, మరొక కొబ్బరిబోండాన్ని పవన్ కు ఇవ్వడంతో ఆ కొబ్బరినీళ్లు తాగారు. 

More Telugu News