nithin: 'శ్రీనివాస కల్యాణం' థియేటర్లకు వచ్చేది అప్పుడేనట!

  • దిల్ రాజు నిర్మాణంలో 'శ్రీనివాస కల్యాణం'
  • నితిన్ సరసన రాశి ఖన్నా 
  • ఆగస్టు 9వ తేదీన విడుదల

దిల్ రాజు నిర్మాణంలో సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కల్యాణం' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో మొదలుకానుంది. నితిన్ జోడిగా రాశి ఖన్నా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను పూర్తిచేసుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా కొనసాగనున్న ఈ కథను, అని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.

 ముందుగా ఈ సినిమాను జూలైలో విడుదల చేయాలనుకున్నారు. కానీ అనుకున్న సమయానికి పనులు పూర్తికాకపోవడం వలన, ఈ సినిమాను ఆగస్టులో రిలీజ్ చేయనున్నట్టుగా చెప్పారు. ఆగస్టు 9వ తేదీని విడుదల తేదీగా నిర్ణయించారనేది తాజా సమాచారం.

 దిల్ రాజు .. సతీశ్ వేగేశ్న కాంబినేషన్లో గతంలో వచ్చిన 'శతమానం భవతి' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అందువలన సహజంగానే ఈ సినిమాపై అందరిలోను అంచనాలు వున్నాయి. ఇక 'తొలిప్రేమ' హిట్ తరువాత రాశి ఖన్నా నుంచి వస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం.  

More Telugu News