krish: 'మహాభారతం' ఇతివృత్తంగా 'పర్వ' .. దర్శకుడిగా క్రిష్?

  • 'మహాభారతం' ఇతివృత్తంగా కన్నడ రచన 
  • ఆ గ్రంధం చదివి ఆసక్తిని పెంచుకున్న క్రిష్ 
  • ఆ గ్రంధానికి దృశ్య రూపం ఇవ్వనున్నాడంటూ టాక్  

'బాహుబలి' సినిమా చూసిన వాళ్లంతా రాజమౌళి 'మహాభారతం' తెరకెక్కిస్తే బాగుంటుందని అనుకున్నారు. అదే తన డ్రీమ్ ప్రాజెక్టు అనీ .. అయితే అందుకు ఇంకా సమయం ఉందని ఆయన అన్నారు. కానీ ఆయనకంటే ముందుగానే క్రిష్ రంగంలోకి దిగనున్నాడంటూ ఫిల్మ్ నగర్లో ఒక టాక్ వినిపిస్తోంది.

'గౌతమీ పుత్ర శాతకర్ణి' సినిమాను తెరకెక్కించి దర్శకుడిగా తన సత్తా చాటుకున్న క్రిష్, 'మణికర్ణిక' ద్వారా మరోమారు తన ప్రతిభాపాటవాలను ఆవిష్కరించనున్నారు. ఈ సినిమా తరువాత ఆయన .. 'మహాభారతం' నేపథ్యంలో సాగే 'పర్వ' అనే సినిమాను రూపొందించనున్నట్టు చెబుతున్నారు. కన్నడ రచయిత 'భైరప్ప' రాసిన 'పర్వ' అనే గ్రంధానికి దృశ్య రూపం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ గ్రంధం చదివిన క్రిష్ ఈ నిర్ణయానికి వచ్చాడని అంటున్నారు .. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. 

More Telugu News