gopichand: యాక్షన్ హీరోతో మూడోసారి జోడీ కడుతోన్న అనుష్క?

  • జయేంద్ర దర్శకత్వంలో గోపీచంద్
  • ఆయన సరసన కథానాయికగా అనుష్క 
  • త్వరలో సెట్స్ పైకి  

'భాగమతి' సినిమాతో అనుష్క అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా తరువాత ఆమె ఏ ప్రాజెక్టు చేయనుందా అనే ఆసక్తితో అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఒక యాక్షన్ హీరో జోడీగా చేయడానికి అంగీకరించిందనేది తాజా సమాచారం. ఆ యాక్షన్ హీరో ఎవరో కాదు .. గోపీచంద్.

కల్యాణ్ రామ్ .. తమన్నా జంటగా దర్శకుడు జయేంద్ర 'నా నువ్వే' సినిమా చేశాడు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత ఆయన గోపీచంద్ తో ఒక సినిమా చేయడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా అనుష్కను ఎంపిక చేసుకున్నాడని సమాచారం. గతంలో గోపీచంద్ తో 'లక్ష్యం' .. 'శౌర్యం' సినిమాలు చేసిన అనుష్కకి ఇది మూడవ సినిమా. ప్రస్తుతం 'పంతం' చేస్తోన్న గోపీచంద్ .. ఆ షూటింగు పూర్తి కాగానే ఈ ప్రాజెక్టుతో సెట్స్ పైకి వెళ్లనున్నాడు. 

More Telugu News