Mahesh Babu: 'భరత్'కి 25 రోజులు .. 205 కోట్లు!

  • కొరటాల దర్శకత్వంలో వచ్చిన 'భరత్' 
  • తెలుగు రాష్ట్రాల్లో 65.32 కోట్ల షేర్  
  • ప్రపంచవ్యాప్తంగా భారీ షేర్

కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా చేసిన 'భరత్ అనే నేను' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి 25 రోజులు పూర్తిచేసుకుంది. ఈ 25 రోజుల్లో ఈ సినిమా 205 కోట్ల గ్రాస్ ను .. భారీ షేర్ ను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల వరకే చూసుకుంటే ఈ సినిమా 65.32 కోట్ల షేర్ ను రాబట్టింది.

మహేశ్ బాబు కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ఇది ప్రత్యేకతను సంతరించుకుంది. కొన్ని ఏరియాల్లో ఈ సినిమా లాభాలను తెచ్చిపెట్టగా, మరి కొన్ని ఏరియాల్లో లాభాలకి చేరువలో వున్నట్టుగా చెబుతున్నారు. దర్శకుడిగా కొరటాలకి గల ఇమేజ్ .. మహేశ్ బాబుకి గల క్రేజ్ .. కథాకథనాలు .. సంగీతం ఈ సినిమా ఈ స్థాయి విజయాన్ని సాధించడంలో ప్రధానమైన పాత్రను పోషించాయి. త్వరలోనే మహేశ్ బాబు తన 25వ సినిమా కోసం వంశీ పైడిపల్లితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు.   

More Telugu News