Sridivya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • తెలుగులో చేస్తానంటున్న తమిళ హీరోయిన్!
  • యూరప్ కి వెళుతున్న మణిరత్నం 'నవాబ్'
  • రామోజీ ఫిలిం సిటీలో 'సాక్ష్యం'  

*  గతంలో 'బస్ స్టాప్', 'మల్లెల తీరం', 'కేరింత' వంటి చిత్రాలలో కథానాయికగా నటించిన తెలుగమ్మాయి శీదివ్య గత కొన్నాళ్లుగా తమిళంలో బిజీగా వుంది. అక్కడ పలు హిట్ చిత్రాలలో నటించి పేరు తెచ్చుకుంది. అయితే, ఈ ముద్దుగుమ్మకు తెలుగు చిత్రాలలో చేయాలని వుందట. ఈ క్రమంలో త్వరలోనే తన మాతృభాషలో ఓ చిత్రంలో నటించనున్నట్టు ఈ చిన్నది చెప్పింది.
*  మణిరత్నం రూపొందిస్తున్న తాజా చిత్రం 'నవాబ్' షూటింగ్ ప్రస్తుతం దుబాయ్ లో జరుగుతోంది. అక్కడి షూటింగ్ పూర్తవగానే యూరప్ లో మరికొంత షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. దాంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.
*  బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సాక్ష్యం' చిత్రం చివరి షెడ్యూల్ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ తో షూటింగ్ పూర్తవుతుందని, వచ్చే నెల 14న చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు తెలిపారు. పూజా హెగ్డే ఇందులో నాయికగా నటిస్తోంది.     

More Telugu News