Jagan: ఏపీలో అభివృద్ధిని అడ్డుకోవాలనేదే జగన్ ఆలోచన: మంత్రి సోమిరెడ్డి

  • ‘పోలవరం’ను అడ్డుకోవాలని చూస్తున్నారు
  • అమిత్ షా కాన్వాయ్ పై దాడి ఘటనను రాజకీయం చేయొద్దు
  • యడ్యూరప్పతో వ్యూహ కమిటీలో ఉన్న వైసీపీ

ఏపీలో అభివృద్ధిని అడ్డుకోవాలనేదే వైఎస్ జగన్ ఆలోచనని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘పట్టిసీమ’ను వ్యతిరేకించినట్టే పోలవరం ప్రాజెక్టును అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా అమిత్ షా కాన్వాయ్ పై దాడి ఘటన గురించి ఆయన ప్రస్తావించారు. ఈ వ్యవహారాన్ని రాజకీయం చేయడం తగదని అన్నారు. కర్ణాటకలో యడ్యూరప్పతో కలసి వ్యూహ కమిటీలో ఉన్న వైసీపీ, ఏపీలో బీజేపీతో పోరాడుతోందంటే ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు.

More Telugu News