somu veerraju: సోము వీర్రాజు వ్యాఖ్యలను ఖండించిన గంటా శ్రీనివాసరావు

  • చంద్రబాబు క్షమాపణలు చెప్పాలన్న సోము వీర్రాజు
  • అలిపిరి ఘటన ప్రణాళిక ప్రకారం జరిగింది కాదన్న గంటా
  • మోదీ, అమిత్ షానే క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్

అలిపిరిలో అమిత్ షా కాన్వాయ్ పై జరిగిన దాడి చంద్రబాబుకు తెలిసే జరిగిందని, ఆయన క్షమాపణలు చెప్పాలంటూ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, వీర్రాజు చేసిన వ్యాఖ్యలను మంత్రి గంటా శ్రీనివాసరావు ఖండించారు. అలిపిరి ఘటనను చంద్రబాబు ఖండించారని, ఘటనకు పాల్పడినవారు ఎవరైనా సరే చర్యలు తప్పవంటూ హెచ్చరించారని గంటా తెలిపారు. ఈ ఘటన ఒక ప్రణాళిక ప్రకారం జరిగింది కాదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న ఆవేదనను అలిపిరి ఘటన వ్యక్తీకరిస్తోందని అన్నారు. మోసం చేసిన మోదీ, అమిత్ షానే ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

More Telugu News