mahanati: 'ప్రియ'మైన అశ్విన్.. కొన్ని క్షణాలు నువ్వే నేనైపోయా!: డైరెక్టర్ సుకుమార్

  • సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన 'మహానటి'
  • గొప్ప సినిమా అంటూ సినీ ప్రముఖుల ప్రశంసలు
  • తాజాగా డైరెక్టర్ సుకుమార్ స్పందన

సావిత్రి జీవిత చరిత్రతో తెరకెక్కిన 'మహానటి' సినిమాపై సినీ ప్రముఖులు తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా 'రంగస్థలం' తో రామ్ చరణ్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ సుకుమార్ 'మహానటి' సినిమాపై పొగడ్తల వర్షం కురిపించారు. థియేటర్ లో 'మహానటి' సినిమా చూసి బయటకి వచ్చాక తనకి జరిగిన ఓ ఆసక్తికర సంఘటన గురించి తన ఫేస్ బుక్ ఖాతాలో పంచుకున్నారు.

'ప్రియ'మైన అశ్విన్.. మహానటి సినిమా చూసి బయటకి వచ్చి నీతో మాట్లాదామని నీ నంబర్ కి ట్రై చేస్తున్నాను. ఈలోగా ఒక ఆవిడ వచ్చి "నువ్వు డైరెక్టరా బాబు" అని అడిగింది. అవునన్నాను.. అంతే.. నన్ను గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది" ఎంత బాగా చూపించావో బాబు మా సావిత్రమ్మని" అంటూ..  నా కళ్లల్లో నీళ్లు.. నేను నువ్వు కాదని ఆవిడకి చెప్పలేకపోయాను.. ఆవిడ ప్రేమంతా నేనే తీసుకున్నాను.. మనసారా.. ఆవిడా నన్ను దీవించి వెళ్లిపోయింది.. కొన్ని క్షణాలు నువ్వే నేనైపోయాను ఆనందంతో.. ఇంతకన్నా ఏం చెప్తాను.. నా అనుభూతి ఈ సినిమా గురించి.. ఆవిడకి ఎప్పటికీ నేను నువ్వు  కాదని తెలియకపోతే బావుండు.. అంటూ తన ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేశారు.

More Telugu News