Asaduddin Owaisi: కర్ణాటకలో కాషాయం తలపాగాతో షాక్ ఇచ్చిన అసదుద్దీన్ ఒవైసీ

  • బెల్గాంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఒవైసీ
  • జేడీఎస్ ను గెలిపించాలంటూ ఓటర్లకు విన్నపం
  • బీజేపీ, కాంగ్రెస్ లపై మండిపాటు

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తన వస్త్రధారణతో అందరికీ... ముఖ్యంగా బీజేపీకి షాక్ ఇచ్చారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో బెల్గాంలో ఓ భారీ బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా కాషాయం రంగు తలపాగాను ధరించి, అందరి దృష్టిని ఆకర్షించారు. ఎప్పుడూ హిందూ అతివాద గ్రూపులపై విరుచుకుపడే ఒవైసీ... ఏకంగా కాషాయాన్నే ధరించడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మాజీ ప్రధాని దేవెగౌడకు చెందిన జేడీఎస్ కు మద్దతుగా ఒవైసీ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆయన విరుచుకుపడ్డారు. కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కాకుండా మరో పార్టీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతోనే తాను జేడీఎస్ కు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నానని ఒవైసీ చెప్పారు. మరోవైపు, ఈ ఎన్నికల్లో ఎంఐఎం తమ పార్టీ తరపున అభ్యర్థులను బరిలోకి దింపకపోవడం గమనార్హం.

More Telugu News