raviteja: రవితేజతో రెండు సినిమాలు .. పారితోషికంగా 16 కోట్లు?

  • 'నేల టిక్కెట్టు'తో పలకరించనున్న రవితేజ 
  • ప్రస్తుతం శ్రీను వైట్ల మూవీతో సెట్స్ పైన 
  • తదుపరి ప్రాజెక్టు సంతోష్ శ్రీనివాస్ తో  

రవితేజ తాజా చిత్రంగా 'నేల టిక్కెట్టు' త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మాస్ ఆడియన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే కథాకథనాలతో ఈ సినిమా రూపొందినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమా తరువాత శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో ఆయన మూడు డిఫరెంట్ లుక్స్ తో కనిపించనున్నాడని అంటున్నారు.ఇక ఈ సినిమాతో పాటు 'కందిరీగ' ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలోను రవితేజ ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. రెండు సినిమాలకి కలిపి రవితేజ 20 కోట్లు పారితోషికంగా అడిగాడట. అయితే 16 కోట్లకు డీల్ కుదిరినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. ఈ రెండు సినిమాలను కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారట.      

More Telugu News