India: ఇంగ్లండ్‌ పర్యటనకు భారత జట్టు ప్రకటన

  • జులై 3 నుంచి సెప్టెంబరు 11 వరకు ఇంగ్లండ్‌ టూర్‌
  • ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు
  • టెస్టు జట్టు ఆటగాళ్ల పేర్లను ఇంకా ప్రకటించని బీసీసీఐ

ఈ ఏడాది జులై 3 నుంచి సెప్టెంబరు 11 వరకు ఇంగ్లండ్‌లో టీమిండియా ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. వాటిల్లో వన్డేల, టీ20 మ్యాచ్‌లకు టీమిండియా ఆటగాళ్ల జాబితాను బీసీసీఐ ప్రకటించింది. వన్డే జట్టులో విరాట్ కోహ్లీ (సారథి), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, అంబటి రాయుడు, మహేంద్రసింగ్ ధోనీ, దినేశ్ కార్తీక్, చాహెల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, సిద్ధార్థ కౌల్, ఉమేశ్ యాదవ్ ఉన్నారు.

ఇక ఇంగ్లండ్‌తో మూడు టీ20ల సిరీస్‌‌‌కి ఎంపిక చేసిన భారత్ జట్టులో విరాట్ కోహ్లీ (సారథి), శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సురేశ్ రైనా, మనీశ్ పాండే, మహేంద్రసింగ్ ధోనీ, దినేశ్ కార్తీక్, చాహెల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్య, సిద్ధార్థ కౌల్, ఉమేశ్ యాదవ్ ఉన్నారు. 

More Telugu News