keerti suresh: 'మహానటి' టీమ్ నుంచి ప్రముఖులకు 'స్వీట్' గిఫ్ట్!

  • నాగ్ అశ్విన్ దర్శకుడిగా 'మహానటి'
  • ప్రధాన పాత్రలో కీర్తి సురేశ్ 
  • సినీప్రముఖులకు ఆహ్వాన పత్రికలు 

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' సినిమా రూపొందింది. సావిత్రి జీవిత విశేషాలు .. ఈ సినిమా కోసం ఎంచుకున్న బలమైన తారాగణం ప్రధానమైన ఆకర్షణగా నిలిచాయి. అందువలన ఈ సినిమాకి భారీ ఓపెనింగ్స్ ఉండొచ్చని అనుకుంటున్నారు. ఈ సినిమా థియేటర్లకు వస్తుందనీ, వచ్చి చూసి ఈ సెలబ్రేషన్ లో భాగస్వాములు కావాలని సినీ ప్రముఖులకు ఈ సినిమా టీమ్ ఆహ్వాన పత్రికలు పంపించినట్టుగా తెలుస్తోంది.

జీడిపప్పు మిఠాయితో కూడిన బాక్స్ తో పాటు ఆహ్వాన పత్రికలను పంపించడం విశేషం. అలాంటి ఆహ్వాన పత్రికను అందుకున్న 'బాహుబలి' నిర్మాత శోభు యార్లగడ్డ, ఈ సినిమా టీమ్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. మొత్తానికి పెద్దగా హడావిడి చేయకుండా సైలెంట్ గా షూటింగ్ కానిచ్చేసిన దర్శక నిర్మాతలు, విడుదల తేదీ నాటికి ప్రమోషన్స్ ను పతాకస్థాయికి తీసుకొచ్చి అంచనాలు పెంచేయడం విశేషం.   

More Telugu News