Andhra Pradesh: మరో కలకలం... పశ్చిమ గోదావరిలో బాలికపై అత్యాచారం!

  • తణుకు మండలం తేతలి గ్రామంలో ఘటన
  • అత్యాచారానికి పాల్పడ్డ 17 ఏళ్ల బాలుడు
  • సహకరించిన మరో ముగ్గురు మైనర్‌ బాలురు
  • నిందితుల అరెస్ట్‌

ఐదేళ్ల బాలికపై 17 ఏళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం తేతలి గ్రామంలో ఈ రోజు కలకలం రేపింది. సదరు బాలిక తమ ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా చూసిన కొంతమంది మైనర్‌ బాలురు చాక్లెట్‌ కొనిస్తామని మభ్యపెట్టి దగ్గరలోని ప్రాథమిక పాఠశాలలోకి తీసుకెళ్లారు. అక్కడి బాత్‌రూంలో చిన్నారిపై వారిలోని ఓ బాలుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.

ఆ సమయంలో మరో ముగ్గురు బాలురు బయట ఉండి కాపలా కాచారు. ఈ ఘటన తరువాత ఇంటికి వచ్చిన బాలికను చూసిన కుటుంబ సభ్యులు తీవ్ర రక్తస్రావం కావడం గమనించి, ఏమైందని అడిగారు. దీంతో ఆ బాలిక జరిగిన విషయాన్ని చెప్పడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు మైనర్‌లను అదుపులోకి తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గుంటూరు జిల్లా దాచేపల్లి ఘటన రాష్ట్రాన్ని కుదిపేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.     

More Telugu News