బూటకపు ఎన్ కౌంటర్లకు నిరసన.. నేడు మావోయిస్ట్ ల బంద్
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తున్న మావోయిస్టులు
- దేశ వ్యాప్త బంద్ కు పిలుపు
- ఒడిశా, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ భద్రత
మహారాష్ట్ర సరిహద్దులోని గడ్చిరోలి జిల్లాలో, తెలంగాణ, మహారాష్ట్ర బలగాలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండటం గమనార్హం. కాగా, భద్రాచలం - చర్ల ప్రధాన రహదారి సత్యనారాయణపురం దగ్గర కల్వర్ట్ ను మావోయిస్టులు పేల్చి వేశారు. మావోయిస్టుల బంద్ నేపథ్యంలో ఎలాంటి విధ్వంసకర ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీస్ అధికారులను తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు.