prabhas: అబుదాబీ రాచకుటుంబంతో ప్రభాస్.. మహిళతో ముచ్చటిస్తున్న ఫొటో విడుదల

  • అబుదాబిలో 'సాహో' షూటింగ్
  • యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ
  • షూటింగ్ విరామంలో రాచకుటుంబీకులను కలుసుకున్న ప్రభాస్

'బాహుబలి' బ్లాక్ బస్టర్ తర్వాత దాదాపు రూ. 200 కోట్లతో ప్రభాస్ కొత్త చిత్రం 'సాహో' తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సుజీత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయికి తగ్గకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన యాక్షన్ సీన్స్ ను అబుదాబిలో చిత్రీకరిస్తున్నారు.
మరోవైపు, షూటింగ్ విరామ సమయంలో అబుదాబి రాచకుటుంబీకులను ప్రభాస్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాచకుటుంబానికి చెందిన ఓ మహిళతో ప్రభాస్ ముచ్చటిస్తున్న ఫొటోను శ్రేయాస్ మీడియా ఛైర్మన్ శ్రీనివాస్ ట్విట్టర్ లో అప్ లోడ్ చేశారు. అయితే, సమావేశానికి సంబంధించిన వివరాలు మాత్రం వెలుగులోకి రాలేదు. 

More Telugu News