adithi rao: పెరుగుతోన్న అవకాశాలు .. పారితోషికం పెంచేసిన అదితీరావు

  • విడుదలకి సిద్ధంగా 'సమ్మోహనం' 
  • వరుణ్ తేజ్ తో త్వరలో సెట్స్ పైకి
  • అందుబాటులో మరిన్ని అవకాశాలు

తెలుగులో తన సత్తా చాటుకునే సరైన అవకాశం కోసం అదితీరావు ఎదురుచూస్తూనే, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటోంది. అలా తెలుగులో సుధీర్ బాబు సరసన ఆమె చేసిన 'సమ్మోహనం' సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సంకల్ప్ రెడ్డి 'అంతరిక్షం' నేపథ్యంలో రూపొందించనున్న సినిమాలోనూ ఆమెనే కథానాయికగా ఎంపిక చేసుకున్నాడు.

ఈ సినిమాలో ఆమె వరుణ్ తేజ్ జోడీగా కనిపించనుంది. ఇక కొంతమంది సీనియర్ హీరోల తదుపరి చిత్రాల కోసం కూడా అదితీరావునే సంప్రదిస్తున్నారట. ఈ నేపథ్యంలో ఆమె పారితోషికం పెంచేసిందనే టాక్ వినిపిస్తోంది. ఇక నుంచి సినిమాకి 50 లక్షలు తీసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నట్టుగా చెబుతున్నారు. సరైన హిట్ పడితే ఈ పారితోషికం రెట్టింపు కావడం ఖాయమనే విషయంలో ఎలాంటి సందేహం లేదు.      

More Telugu News