Allu Arjun: బన్నీ స్టేజ్ పైకి రావడానికే 20 లక్షల ఖర్చు!

  • ఈ నెల 29న ప్రీరిలీజ్ ఈవెంట్
  • వెరైటీగా ప్లాన్ చేసిన టీమ్
  • వచ్చేనెల 4వ తేదీన విడుదల

వక్కంతం వంశీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన ' నా పేరు సూర్య' .. వచ్చేనెల 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 29వ తేదీన హైదరాబాద్ .. గచ్చిబౌలిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి.

సాధారణంగా ఇలాంటి వేడుకల్లో హీరోలను ఆహ్వానించగానే మాములుగా స్టేజ్ పైకి వచ్చేస్తుంటారు. కానీ 'నా పేరు సూర్య' వేడుకలో స్టేజ్ పైకి బన్నీ ఎంట్రీ వెరైటీగా ఉండేలా ప్లాన్ చేశారట. ఈ సినిమా కంటెంట్ కి తగినట్టుగా .. జిమ్నాస్టిక్స్ ను జోడిస్తూ చేసే ప్రయోగంతో ఆయన స్టేజ్ పైకి వస్తాడట. ఇందుకు గాను దాదాపు 20 లక్షల వరకూ ఖర్చు చేస్తున్నట్టుగా చెబుతున్నారు. సినిమాపై అంచనాలు పెరిగేలా ..  ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ ఫంక్షన్ ను నిర్వహించనున్నారని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు.          

More Telugu News