sai dharam tej: మెగా హీరో మూవీనుంచి ఫస్టు సైట్ రిలీజ్

  • కరుణాకరన్ దర్శకత్వంలో తేజు 
  • కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ 
  • ఈ నెల 28వ తేదీన ఫస్టులుక్

సాయిధరమ్ తేజ్ హీరోగా కరుణాకరన్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. కె.ఎస్.రామారావు నిర్మిస్తోన్న ఈ సినిమాలో, తేజు సరసన కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్టు సైట్ పేరుతో ఒక పోస్టర్ ను వదిలారు. కలర్ .. బ్లాక్ అండ్ వైట్ మిక్స్ చేసిన ఈ పోస్టర్ లో, గిటార్ తగిలించుకుని వెళుతోన్న సాయిధరమ్ తేజ్ కనిపిస్తున్నాడు.

 పోస్టర్లో అంతర్లీనంగా కథానాయికను కూడా ఆవిష్కరించారు. ఇది సంగీత ప్రధానమైన ప్రేమకథా చిత్రమనే విషయాన్ని ఈ పోస్టర్ ద్వారా కరుణాకరన్ చెప్పాడు. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా నుంచి ఫస్టులుక్ ను రిలీజ్ చేయనున్నట్టు ఈ పోస్టర్ ద్వారానే ప్రకటించారు. కరుణాకరన్ ప్రేమకథల స్పెషలిస్ట్ కనుక, ఈ సినిమాపై యూత్ లో అంచనాలు పెరిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.       

More Telugu News