Anushka Sharma: తన శ్రీవారి దుస్తులు ధరిస్తోన్న అనుష్క‌ శర్మ

  • ఫొటోలు వైరల్‌
  • కోహ్లీ టీ షర్టులతో అనుష్క
  • ఫ్యాన్స్‌ సోషల్ మీడియా ఖాతాల్లో ఫొటోలు

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ గతేడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వారిద్దరూ జంటగా ఎక్కడ కనపడినా వారి ఫొటోలు వెంటనే వైరల్ అవుతుంటాయి. తాజాగా నెటిజన్లు ఓ కొత్త విషయం కనిపెట్టి కోహ్లీ, అనుష్క శర్మల ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఈ ఫొటోల్లో విశేషం ఏంటంటే అనుష్క శర్మ తన శ్రీవారి దుస్తులను ధరిస్తోంది. ముఖ్యంగా విరాట్‌ కోహ్లీ వేసుకున్న టీషర్టులను ధరించి అనుష్క శర్మ కనపడుతోంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను విరుష్క ఫ్యాన్స్‌ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో పోస్ట్‌ చేశారు. మీరూ చూడండి..       

More Telugu News