mobile: కడప జిల్లాలో మహిళ ప్రాణాలు బలిగొన్న సెల్ ఫోన్

  • పేలిపోయిన ఛార్జింగ్ పెట్టిన మొబైల్ ఫోన్
  • అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయిన మహిళ
  • ఆవేదనతో అక్క కుమారుడు కూడా మృతి

సెల్ ఫోన్ల పేలుడుతో పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ప్రపంచ వ్యాప్తంగా అక్కడక్కడా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా అలాంటి విషాద ఘటన కడప జిల్లాలో జరిగింది. చక్రాయపేట మండలం కల్లూరిపల్లె తాండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే, బుక్కే శాంతమ్మ అనే మహిళ తన సెల్ ఫోన్ కు ఛార్జింగ్ పెట్టుకుంది. కాసేపటి తర్వాత సెల్ ఫోన్ ఒక్కసారిగా పేలిపోయింది.

 ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన శాంతమ్మ అక్కడికక్కడే దుర్మరణం పాలయింది. మరోవైపు ఆమె అక్క కుమారుడు ఈశ్వర్ నాయక్ హైదరాబాదులో నివసిస్తున్నాడు. శాంతమ్మ చనిపోయిన విషయాన్ని ఈశ్వర్ కు ఫోన్ ద్వారా తెలిపారు బంధువులు. ఈ నేపథ్యంలో, తీవ్ర వేదనకు గురైన ఆయన కూడా ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనల నేపథ్యంలో, కల్లూరిపల్లె తాండాలో విషాదం నెలకొంది.

More Telugu News