Puri Jagannadh: మెగా హీరోతో పూరీ తదుపరి సినిమా?

  • పూరీ తాజా చిత్రంగా 'మెహబూబా'
  • తదుపరి సినిమా రాజకీయ నేపథ్యంలో 
  • కథపై జరుగుతోన్న కసరత్తు  

పూరీ జగన్నాథ్ తన తనయుడు ఆకాశ్ తో 'మెహబూబా' సినిమాను తెరకెక్కించాడు. ఒక సైనికుడికి .. ముస్లిం యువతికి మధ్య కొనసాగే ప్రేమకథగా ఈ సినిమా ఉండనుంది. త్వరలోనే ఈ సినిమాను ఆయన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తరువాత ఆయన మెగా హీరోతో ఒక సినిమా చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.

పొలిటికల్ డ్రామాగా ఈ కథ కొనసాగుతుందని చెబుతున్నారు. కొంతకాలంగా పూరీ ఈ కథపై చేస్తూ వచ్చిన కసరత్తు పూర్తికావొచ్చిందని అంటున్నారు. రాజకీయ నేపథ్యంలో కొనసాగే ఈ సినిమాను సాధ్యమైనంత వరకూ చరణ్ తోనే చేయాలని భావిస్తున్నాడట. కుదరని పక్షంలో వరుణ్ తేజ్ తో సెట్స్ పైకి వెళ్లాలని అనుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి.   

More Telugu News