pawan kalyan: మా అమ్మను పబ్లిక్ గా తిట్టించే విషయంలో టీడీపీ బాసులకు సహకరించిన త్రయం ఇదే!: ఫొటోలు విడుదల చేసిన పవన్ కల్యాణ్

  • వరుస ట్వీట్లతో విరుచుకుపడుతున్న పవన్
  • టీడీపీ బాసులకు వీరు ముగ్గురు సహకరించారు
  • నా తల్లిని పబ్లిక్ లో తిట్టించారు

తనకు జన్మనిచ్చిన తల్లిని నడిరోడ్డు మీద అసభ్యంగా తిట్టించి, దాన్ని పదేపదే ప్రసారం చేసి, డిబేట్లు పెట్టి... అత్యంత దారుణంగా వ్యవహరించారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ వరుస ట్వీట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీపై కూడా ఆయన మండిపడ్డారు. తాజాగా ఈ దారుణానికంతా ఈ ముగ్గురే కారణమంటూ ఆయన మరో ట్వీట్ చేశారు. ఈ ముగ్గురూ కలసి పబ్లిక్ లో తన తల్లిని దూషించేందుకు తెలుగుదేశం పార్టీ బాసులకు సహకరించారని చెప్పారు. టీవీ9 రవిప్రకాశ్, శ్రీని రాజు, రామ్ గోపాల్ వర్మల ఫొటోలను ట్విట్టర్ లో అప్ లోడ్ చేశారు.

More Telugu News