India: భారత్‌లో అత్యంత విశ్వసనీయ కంపెనీల జాబితా

  • టెలీ కమ్యూనికేషన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ సర్వే
  • అగ్రస్థానంలో శాంసంగ్ 
  • టాప్‌-5లో సోనీ, ఎల్‌జీ, టాటా, యాపిల్‌ సంస్థలు

శాంసంగ్‌ కంపెనీకి భారత్‌లో ఎంతగా ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. భారత్‌లో అత్యంత విశ్వసనీయ కంపెనీల విషయంపై టీఆర్‌ఏ (టెలీ కమ్యునికేషన్స్‌ రెగ్యులేటరీ అథారిటీ) నిర్వహించిన సర్వేలో ఆ కంపెనీయే అగ్రస్థానంలో నిలిచింది. ఈ సర్వేను 16 నగరాల్లో  మొత్తం 2,450 మంది నిర్వహించారు. భారత్‌ ఆయా బ్రాండ్‌ల విశ్వసనీయతలో శాంసంగ్‌ తరువాత సోనీ, ఎల్‌జీ, టాటా, యాపిల్‌ సంస్థలు ఉన్నాయి.

వీటిల్లో టాటా మాత్రమే భారత్‌కు చెందిన సంస్థ. ఆ తరువాతి స్థానాల్లో డెల్‌, హోండా, నైకీ, హ్యూవ్‌లెట్‌ ప్యాకార్డ్‌, మారుతి సుజుకి ఉన్నాయి. గతేడాది కన్నా ఈ సారి 320 కొత్త బ్రాండ్లు టాప్‌ 1000లో స్థానం దక్కించుకున్నాయి. ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ విభాగంలో పెప్సీ మొదటిస్థానంలో నిలిచింది.

More Telugu News