Bharath Ane Nenu: 'భరత్ అనే నేను' సినిమా అదనపు ప్రదర్శనలకు ఏపీ ప్రభుత్వం అనుమతి

  • ఎల్లుండి విడుదల కానున్న మహేశ్‌ కొత్త సినిమా
  • ఈ నెల 20 నుంచి 27 వరకు అదనపు ప్రదర్శనలు
  • ఆసక్తిగా ఎదురు చూస్తోన్న అభిమానులు

కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘భరత్ అనే నేను’ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అదనపు ప్రదర్శనలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. ఈ నెల 20 నుంచి 27 వరకు అదనపు ప్రదర్శనలకు అనుమతి మంజూరు చేస్తున్నట్లు ఏపీ సర్కారు పేర్కొంది.

కాగా, డీవీవీ ఎంటర్‌టైన్మెంట్‌ పతాకంపై నిర్మాత దానయ్య ఈ సినిమాను నిర్మించగా, ఇందులో కైరా అద్వానీ.. మహేశ్‌ బాబుకి జోడీగా నటించింది. ఈ నెల 20న విడుదల కానున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్, పాటలకు మంచి స్పందన వచ్చింది. సీఎంగా నటిస్తోన్న మహేశ్‌ బాబు 'భరత్‌ అనే నేను' కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

More Telugu News