kalva: 'మీ ఎమ్మెల్యేలే మాతో టచ్‌లో ఉన్నారు'.. విజయ సాయిరెడ్డికి ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు కౌంటర్‌

  • వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు ఇప్పటికే మా పార్టీలో చేరారు 
  • జగన్ వైఖరి నచ్చకే వారు పార్టీ మారారు
  • ఈ విషయాన్ని విజయ సాయిరెడ్డి గుర్తుకు తెచ్చుకోవాలి 

వైసీపీ నేత, రాజసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్‌ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీతో టచ్‌లో ఉన్నారని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై కాల్వ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ... వైసీపీ అధినేత జగన్ వైఖరి నచ్చక పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే తమ పార్టీలో చేరిన విషయాన్ని విజయ సాయిరెడ్డి గుర్తుకు తెచ్చుకోవాలని వ్యాఖ్యానించారు. వైసీపీ ఎమ్మెల్యేలే టీడీపీతో టచ్‌లో ఉన్నారని, ఈ విషయాన్ని విజయ సాయిరెడ్డి తెలుసుకుంటే మంచిదని అన్నారు. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యేలలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ అదే పార్టీ నుంచి ఎంతమంది పోటీ చేస్తారో తెలుసుకుంటే విజయ సాయిరెడ్డికి వైసీపీ పరిస్థితి అర్థమవుతుందని అన్నారు.

More Telugu News