Mahesh Babu: 'భరత్ అనే నేను'కి జీరో కట్స్ .. సెన్సార్ పూర్తి!

  • మహేశ్ మూవీ కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
  • హిట్ ఖాయమనే టాక్ 
  • ఈ నెల 20వ తేదీన విడుదల

'భరత్ అనే నేను' ఈ నెల 20వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుని యు/ఎ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఎలాంటి అభ్యంతరాలను వ్యక్తం చేయకుండా జీరో కట్స్ తో ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ ను జారీచేయడం విశేషం.

 వినోదానికి సందేశాన్ని జోడించి కొరటాల సిద్ధం చేసిన ఈ సినిమాపై అన్ని వర్గాల ప్రేక్షకులలోను ఆసక్తి వుంది. ఈ సినిమాకి ముందు కొరటాల తెరకెక్కించిన అన్ని సినిమాలు ఘన విజయాలను సాధించాయి. ఆ సక్సెస్ ల జాబితాలో 'శ్రీమంతుడు' కూడా ఉండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో మహేశ్ వుంటే, ఈ సినిమా తన కెరియర్ కి మంచి హెల్ప్ అవుతుందనే ఆశతో కైరా అద్వాని వుంది.       

More Telugu News