Anasuya: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • 'సైరా' సినిమా గురించి స్పందించిన అనసూయ 
  • 'జైసింహా' నూరు రోజుల వేడుక 
  • శర్వానంద్ తో సాయిపల్లవి మరో చిత్రం 
  • మరో హాలీవుడ్ సినిమాలో రాధికా ఆప్టే


*  చిరంజీవి నటిస్తున్న 'సైరా' చిత్రంలో తాను ఒక కీలక పాత్రను పోషించనున్నట్టు వస్తున్న వార్తలను హాట్ టీవీ యాంకర్ అనసూయ ఖండించింది. ఈ విషయంలో ఆ చిత్రం యూనిట్ నుంచి ఇంతవరకు తనను ఎవరూ సంప్రదించలేదని, ఈ ప్రచారంలో వాస్తవం లేదని అనసూయ చెప్పింది. ఇటీవల 'రంగస్థలం' చిత్రంలో ఆమె పోషించిన రంగమ్మత్త పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి విదితమే.
*  నందమూరి బాలకృష్ణ నటించిన 'జైసింహా' చిత్రం ఈ నెల 21తో నూరు రోజుల ప్రదర్శన పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ చిత్రం వేడుకను నిర్వహించడానికి నిర్ణయించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మే 2న ఈ వేడుకను నిర్వహించడానికి నిర్మాత సి.కల్యాణ్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
*  ప్రస్తుతం 'పడిపడి లేచే మనసు' సినిమాలో కలసి నటిస్తున్న శర్వానంద్, సాయిపల్లవి జంట త్వరలో మరో సినిమా కూడా చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. 'నీది నాది ఒక కథ' ఫేం వేణు ఊడుగుల దర్శకత్వంలో రూపొందే చిత్రంలో వీరిద్దరూ జంటగా నటిస్తారట.
*  తరచూ వివాదాస్పద కామెంట్లతో వార్తల్లో నిలిచే కథానాయిక రాధికా ఆప్టే తాజాగా మరో హాలీవుడ్ సినిమాలో నటించడానికి ఓకే చెప్పింది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే స్పై డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇందులో రాధిక గూఢచారిగా నటిస్తుంది. గతంలో తెలుగులో 'లెజండ్' సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే ఓ హాలీవుడ్ చిత్రంలో నటిస్తోంది.       

More Telugu News