shalini panday: కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో కూరగాయలమ్మిన షాలినీ పాండే

  • 'మేము సైతం' కార్యక్రమంలో పాల్గొన్న షాలినీ పాండే
  • సమస్యల్లో ఉన్నవారిని ఆదుకుంటున్న 'మేము సైతం'
  • కూరగాయలమ్మి, సెల్ఫీలు దిగిన షాలినీ పాండే

హైదరాబాదులోని కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో అర్జున్ రెడ్డి ఫేమ్ షాలినీ పాండే హల్ చల్ చేసింది. ఒక టీవీ ఛానెల్ లో మంచు లక్ష్మి వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న 'మేము సైతం' కార్యక్రమంలో షాలినీ పాండే పాల్గొంది. ఈ కార్యక్రమం ద్వారా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని సినీ నటులు ఆదుకుంటున్న సంగతి తెలిసిందే. అలాగే ఇబ్బందుల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు షాలినీ పాండే ముందుకు వచ్చింది. ఈ క్రమంలో షాలినీ పాండే కేపీహెచ్బీలో కూరగాయలమ్మింది. ఈ సందర్భంగా పలువురు అభిమానులతో ఫోటోలు దిగింది. 

More Telugu News