Chandrababu: చంద్రబాబుకు చీర, గాజులు పంపిన వైసీపీ

  • ప్రత్యేక హోదా ఉద్యమంలో భాగంగా వైసీపీ కార్యక్రమం
  • ర్యాలీ నిర్వహించి, పోస్టు బాక్సులో వేసిన మహిళా నాయకులు 
  • చంద్రబాబుది చేతకానితనమన్న నాయకురాళ్లు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు చీర, గాజులు, పసుపు, కుంకుమను వైసీపీ మహిళా విభాగం పంపింది. అనంతపురం నగర అధ్యక్షురాలు కృష్ణవేణి ఆధ్వర్యంలో ఈ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైసీపీ చేస్తున్న నిరసన కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని టవర్ క్లాక్ నుంచి ప్రధాన తపాలా కార్యాలయం వరకు ర్యాలీని నిర్వహించి... చీర, గాజులు, పసుపు, కుంకుమను పోస్ట్ బాక్సులో వేశారు. ఈ సందర్భంగా మహిళా నేతలు మీడియాతో మాట్లాడుతూ, ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్నది వైసీపీనే అని అన్నారు. చంద్రబాబు చేతకానితనంతో రాష్ట్రానికి హోదా రాకుండా ఉందని... అందుకే వీటన్నింటినీ ఆయనకు పంపిస్తున్నామని చెప్పారు. 

More Telugu News