'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' విలువను పెంచిన రషీద్ ఖాన్

  • 13 పరుగులిచ్చి, ఒక వికెట్ తీసిన రషీద్ 
  • 18 డాట్ బాల్స్ వేసిన మూడో ఆటగాడిగా రికార్డు 
  • 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' గా నిలిచిన రషీద్  
ఆఫ్ఘనిస్థాన్ స్పిన్ సంచలనం రషీద్ ఖాన్ 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' విలువను పెంచాడు. ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఈ సన్ రైజర్స్ హైదరాబాదు ఆటగాడు నాలుగు ఓవర్లు వేసి ఒక వికెట్ తీసుకుని, కేవలం 13 పరుగులు ఇచ్చాడు. అంతే కాకుండా ఐపీఎల్ మ్యాచ్ లో 18 డాట్ బాల్స్ వేసిన మూడో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. దీంతో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' గా నిలిచాడు.

అయితే, తనకు వచ్చిన ఆ అవార్డును అనారోగ్యంతో బాధపడుతున్న తన స్నేహితుడి కుమారుడికి అంకితం ఇచ్చాడు. ఆ అవార్డుకు వచ్చిన రివార్డును బాలుడి వైద్యానికి ఖర్చు చేస్తానని తెలిపాడు. దీంతో రషీద్ మంచి మనసు పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 
Go Back to Shorts
man of the match
raseed khan
rashid khan
ipl
srh

More Telugu News