nitin gadkari: పక్కపక్కనే ఉన్నా... పలకరించుకోని నితిన్‌ గడ్కరీ, చంద్రబాబు

  • సింగపూర్ పర్యటనలో ఉన్న గడ్కరీ, చంద్రబాబు
  • హిందూస్థాన్ టైమ్స్ మింట్ ఆసియా లీడర్ షిప్ సమ్మిట్‌కు హాజరు
  • సింగపూర్‌లో పలువురితో చంద్రబాబు చర్చలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఆయన హిందూస్థాన్ టైమ్స్ మింట్ ఆసియా లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొని పలువురు ప్రతినిధులతో చర్చించారు. ఆ దేశ మంత్రి ఈశ్వరన్ తో కూడా భేటీ అయి ఏపీలో పెట్టుబడులపై మాట్లాడారు.

కాగా, హిందూస్థాన్ టైమ్స్ మింట్ ఆసియా లీడర్ షిప్ సమ్మిట్ కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా గడ్కరీ, చంద్రబాబు పక్కపక్కనే ఉన్నప్పటికీ ఒకరినొకరు పలకరించుకోలేదు. ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయట్లేదంటూ కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే.                                                                             

More Telugu News