Prakash Raj: దేశంలో ప్రస్తుత పరిస్థితులు చూసి భయపడుతున్నాను: బెంగళూరులో ప్రకాశ్‌ రాజ్‌

  • ఎవరికి మద్దతిస్తే న్యాయం జరుగుతుందో ఆలోచించాలి
  • ఏ పార్టీ ద్వారా న్యాయం జరుగుతుందో అర్థం చేసుకోవాలి
  • దేశంలో మార్పు కోరుకునే ప్రజలు కలిసి రావాలి

దేశంలో ఎవరికి మద్దతిస్తే న్యాయం జరుగుతుందో ప్రజలు ఆలోచించాలని సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ అన్నారు. ఈ రోజు బెంగళూరులో తెలంగాణ సీఎం కేసీఆర్‌తో కలిసి మాజీ ప్రధాని దేవేగౌడతో దేశ రాజకీయాలపై, కొత్త కూటమి ఏర్పాటుపై చర్చించిన అనంతరం ప్రకాశ్‌ రాజ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు హామీలు ఇచ్చి మోసం చేశారో ఎవరు న్యాయం చేశారో ప్రజలు తెలుసుకోవాలని, ఏ పార్టీ ద్వారా న్యాయం జరుగుతుందో అర్థం చేసుకోవాలని సూచించారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులు చూసి తాను భయపడుతున్నానని, ఇటువంటి సమయంలో దేశంలో మార్పు కోరుకునే ప్రజలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.  

More Telugu News