charan: తండ్రి రికార్డును అధిగమించిన తనయుడిగా చరణ్!

  • తొలివారంలో 128 కోట్ల వసూళ్లు 
  • 13 రోజులకి 161 కోట్ల గ్రాస్
  • 14వ రోజున కొత్త రికార్డు

'రంగస్థలం' విడుదలైన తరువాత అందరి నోటివెంట అదుర్స్ అనే మాటే వచ్చింది. ఆ రోజు నుంచి ఈ సినిమా తన దూకుడును కొనసాగిస్తూనే వస్తోంది. భారీ వసూళ్లతో కొత్త రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతూనే వుంది. అలా ఈ సినిమా తాజాగా 'ఖైదీ నెంబర్ 150' రికార్డును కూడా అధిగమించింది.

 'బాహుబలి'ని ఒక ప్రత్యేక చిత్రంగా భావించి పక్కన పెడితే, వసూళ్ల పరంగా ఆ తరువాత స్థానంలో నిన్నమొన్నటివరకూ 'ఖైదీ నెంబర్ 150' సినిమా నిలిచింది. ఈ సినిమా 164 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. ఇక మార్చి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'రంగస్థలం' తొలిరోజునే 128 కోట్లను కొల్లగొట్టేసింది. 13వ రోజు పూర్తయ్యేనాటికి 161 కోట్ల గ్రాస్ ను రాబట్టిన ఈ సినిమా, 14వ రోజుకి 'ఖైదీ నెంబర్ 150' రికార్డును అధిగమించిందని సినీ విశ్లేషకుడు జీవీ ట్వీట్ చేశారు. తండ్రి సెట్ చేసిన రికార్డును తనయుడు అధిగమించడం విశేషమే మరి.

More Telugu News