samanta: సస్పెన్స్ థ్రిల్లర్ లో సమంత .. భూత్ బంగ్లాలో షూటింగ్

  • రెండవ షెడ్యూల్లో 'యు టర్న్'
  • జర్నలిస్ట్ పాత్రలో సమంత
  • పోలీస్ ఆఫీసర్ గా ఆది పినిశెట్టి         

సమంత 'యు టర్న్' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కన్నడలో 2016లో వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ కి ఇది రీమేక్. కన్నడలో ఈ సినిమా అనూహ్యమైన స్థాయిలో ఆదరణ పొందుతూ భారీ వసూళ్లను సాధించింది. దాంతో అదే పేరుతో .. అదే దర్శకుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు.

కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఈ సినిమాలో సమంత ప్రధానమైన పాత్రను పోషిస్తోంది. ఇటీవలే ఫస్టు షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా, సెకండ్ షెడ్యూల్ షూటింగును మొదలెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ .. హైదరాబాద్ భూత్ బంగ్లాలో జరుగుతోంది. రాహుల్ రవీంద్రన్ .. ఆది పినిశెట్టి కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు. వీళ్ల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. జర్నలిస్ట్ పాత్రలో సమంత నటిస్తుండగా .. పోలీస్ ఆఫీసర్ పాత్రను ఆది పినిశెట్టి చేస్తున్నాడు. ఈ సినిమా తన కెరియర్లో చెప్పుకోదగినదిగా నిలుస్తుందనే గట్టి నమ్మకంతో సమంత వుంది.       

More Telugu News