bundh: 16న జరిగే ఏపీ బంద్‌కు ప్రతిపక్ష పార్టీల మద్దతు

  • ప్రత్యేక హోదా కోసం పోరుబాట
  • బంద్‌కు హోదా సాధన సమితి పిలుపు
  • మోదీ దీక్ష ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిందన్న చలసాని

ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాలను సాధించుకునే క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఈ నెల 16న ఏపీ బంద్‌ నిర్వహిస్తామని ప్రత్యేక హోదా సాధన సమితి పేర్కొంది. ఈ బంద్‌కు వైసీపీ, వామపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.... ప్రధాని మోదీ దీక్ష ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిందని అన్నారు. ఈ నెల 16న నిర్వహించనున్న బంద్‌లో అత్యవసర సేవలను మినహాయిస్తున్నామని చెప్పారు.  ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొని బంద్‌ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 

More Telugu News