bellamkonda srinivas: పూజా హెగ్డేతో బెల్లంకొండ శ్రీనివాస్ .. అమెరికాలో షూటింగ్

  • శ్రీవాస్ దర్శకత్వంలో 'సాక్ష్యం'
  • అమెరికాలో 15 రోజుల పాటు షూటింగ్ 
  • త్వరలో ప్రేక్షకుల ముందుకు

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా దర్శకుడు శ్రీవాస్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా 'సాక్ష్యం' ను రూపొందిస్తున్నాడు. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో జరుగుతోంది.

అమెరికాలోని గ్రాండ్ కానియన్ .. న్యూయార్క్ .. న్యూజెర్సీ వంటి ప్రాంతాల్లో ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. 15 రోజులపాటు ప్లాన్ చేసిన ఈ షెడ్యూల్లో నాయకా నాయికలపై ఒక పాటను కూడా చిత్రీకరించనున్నారు. అక్కడ చిత్రీకరించే సన్నివేశాలు కథలో కీలకం కానున్నాయని అంటున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.    

More Telugu News