Jammu And Kashmir: బ్రేకింగ్ న్యూస్... పంజాబ్, కాశ్మీర్ లో భూకంపం!

  • రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదు
  • ఉదయం 6 గంటల సమయంలో భూకంపం
  • కేంద్రం అమృతసర్ సమీపాన

జమ్మూకశ్మీర్‌, పంజాబ్ రాష్ట్రాలో ఈ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై ఈ ప్రకంపన 4.0గా నమోదైందని విపత్తు నిర్వహణా శాఖ ప్రకటించింది. ఉదయం 6.06కు ఈ భూకంపం వచ్చిందని దీని కేంద్రం పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ సమీపంలో ఉందని అన్నారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి లేదా ప్రాణ నష్టం జరిగినట్టు రిపోర్టులు రాలేదని అధికారులు వెల్లడించారు. భూకంపంపై మరింత సమాచారం తెలియాల్సి వుంది. కాగా, జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలు భూకంపం జోన్-5లో ఉన్న సంగతి తెలిసిందే. 

More Telugu News