Salman Khan: ఆ రోజు కృష్ణ జింకకు నీళ్లు తాగించి, బిస్కెట్లు తినిపించాను: సల్మాన్‌ ఖాన్‌ వ్యాఖ్యలు వైరల్

  • సల్మాన్‌ ఖాన్‌కు జైలు శిక్ష నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు వైరల్
  • గతంలో జాతీయ మీడియాతో స్టోరీ చెప్పిన వైనం
  • పొదలో జింక ఇరుక్కోవడం చూశామన్న కండలవీరుడు
  • దానికి సాయం చేశామని వ్యాఖ్య

రాజస్థాన్‌లోని ఘోడా ఫార్మ్స్‌లో సెప్టెంబర్‌ 28, 1998న కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడ్డ విషయం తెలిసిందే. దీంతో సల్మాన్‌ గతంలో ఈ కేసు గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. 2009లో ఓ జాతీయ మీడియాతో సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ ఓ స్టోరీ చెప్పాడు.

'హమ్‌ సాత్ సాథ్‌ హై' సినిమా షూటింగ్‌ ముగించుకొని తాను ఆ రోజు తన సహనటులతో బయలుదేరానని అన్నాడు. ఆ సమయంలోనే తమకు కృష్ణ జింకలు ఎదురుపడ్డాయని, దీంతో ఒక దానికి తాము బిస్కెట్లు తినిపించామని అన్నాడు. అదే సమయంలో ఓ జింక పొదలో ఇరుక్కోవడం తాము చూశామని, అది తీవ్రంగా ఇబ్బంది పడుతుండడం చూసి దానిని పొదలోంచి బయటకు తీశానని, అనంతరం దానికి కొన్ని నీళ్లు తాగించామని అన్నాడు. అనంతరం ఆ జింక కొన్ని బిస్కెట్లను తిని అడవిలోకి వెళ్లిపోయిందని చెప్పాడు. అంతేగానీ, తాను ఏ తప్పూ చేయలేదని చెప్పుకొచ్చారు.

More Telugu News