Vijay Sai Reddy: విజయసాయిరెడ్డి 420 తాతయ్య!: మంత్రి జవహర్ వ్యంగ్యం

  • మోసం చేయడంలో విజయసాయిరెడ్డిని మించినవారు లేరు
  • ఆయనకు అంతా అవినీతిమయంగానే కనిపిస్తుంది!
  • పవన్ ఏం మాట్లాడాతారో, ఏం చేస్తారో అర్థం కావడం లేదు!
  • జేఎఫ్సీ కమిటీ ఏర్పాటుతో ఆయన ఏం సాధించారు?
సీఎం చంద్రబాబును ‘యూటర్న్ అంకుల్’గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అభివర్ణించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఇంకా మండిపడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయసాయిరెడ్డిని ‘420 తాతయ్య’ అంటూ మంత్రి జవహర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

 ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, మోసం చేయడంలో విజయసాయిరెడ్డిని మించినవారు లేరని, ఆయనకు అంతా అవినీతిమయంగానే కనిపిస్తుందని, జగన్ జైలుకు వెళ్లకుండా ఉండేలా చూడాలని విజయసాయిరెడ్డి ఆరాటపడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనా ఆయన విమర్శలు చేశారు. పవన్ ఏం మాట్లాడతారో, ఏం చేస్తారో అర్థం కావడం లేదని, జేఎఫ్సీ కమిటీ ఏర్పాటు చేసిన పవన్ ఏం సాధించారో చెప్పాలని ఎద్దేవా చేశారు.

More Telugu News

Vijay Sai Reddy
minister jawahar