Rana Daggubati: రానా నిర్మాతగా 'కేరాఫ్ కంచరపాలెం' చిత్రం

  • న్యూయార్క్ చలనచిత్రోత్సవానికి ఎంపికైన తొలి తెలుగు సినిమా
  • ఈ సినిమాను సమర్పిస్తుండటం గర్వంగా ఉంది
  • ప్రస్తుతం '1945' అనే ద్విభాషా చిత్రంలో నటిస్తున్న రానా

విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో రానా ఇప్పుడు నిర్మాత అవతారమెత్తాడు. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై 'కేరాఫ్ కంచరపాలెం' అనే సినిమాను అతను సమర్పిస్తున్నాడు. ఈ విషయాన్ని రానా ట్విట్టర్ వేదికగా తెలిపాడు.

"ఈ చిత్రం న్యూయార్క్ చలనచిత్రోత్సవంలో ప్రదర్శనకు ఎంపికైన తొలి తెలుగు సినిమా. ఇలాంటి చిత్రాన్ని సమర్పిస్తుండటం నాకు చాలా సంతోషంగానూ, గర్వంగానూ ఉంది. ఈ పెద్ద, చిన్న సినిమాను మీకు చూపించాలని నాకు చాలా ఆత్రుతగా ఉంది" అని ట్వీట్ చేశాడు. స్వీకర్ అగస్థి బాణీలు సమకూర్చిన ఈ చిత్రానికి వెంకటేశ్ మహా దర్శకత్వం వహించారు. విజయ ప్రవీణ పరుచూరి నిర్మాత. కాగా, రానా ప్రస్తుతం '1945' అనే సినిమాలో నటిస్తున్నాడు. తెలుగు, తమిళం రెండు భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రెజీనా హీరోయిన్.

More Telugu News