కోపం వచ్చినప్పుడు మా వారు ఎలా ఉండేవారంటే...!: గీతాంజలి

  • నాకు వంట చేయడం రాదు 
  • ఆయన కోసమే నేర్చుకున్నాను 
  • వంట మనిషితో చేయిస్తే కనిపెట్టేసేవారు
రామకృష్ణ .. గీతాంజలి ఇద్దరూ కూడా ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఇద్దరూ కూడా విభిన్నమైన పాత్రలను చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా ఐడ్రీమ్స్ తో గీతాంజలి మాట్లాడుతూ .. రామకృష్ణ గురించిన కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు. "సాధారణంగా రామకృష్ణ గారు ప్రేమగా వున్నప్పుడు నన్ను 'గీతా' అని పిలిచేవారు ఆయనకి కాస్త కోపం వచ్చిందనుకోండి 'గీతాంజలి గారు' అని పిలిచేవారు".

"అలా నా పేరుకు చివరన 'గారు' తగిలించారంటే ఆయనకి కోపం వచ్చిందని అర్థం. ఆ రోజంతా కూడా ఆయన నన్ను అలాగే పిలిచేవారు. ఆ సమయంలో ఇంటికి ఎవరైనా వచ్చినా 'గీతాంజలి గారు .. మీ కోసం ఎవరో వచ్చారు' అని చెప్పేవారు. నాకు వంట చేయడం రాదు .. అయితే, ఆయన కోసమని ఆయనకి ఇష్టమైనవి చేయడం మా మేనత్తల దగ్గర నేర్చుకున్నాను. ఒక్కరోజు వంటమనిషితో చేయించినా వెంటనే కనిపెట్టేసి 'గీతాంజలి గారు' అంటూ పిలిచేవారు" అంటూ నవ్వేశారు.    
Go Back to Shorts
geetanjali
ramakrishna

More Telugu News