సీబీఎస్ఈ పేపర్ లీక్... రెండు పరీక్షలకు రీఎగ్జామ్.. 28 లక్షల మంది విద్యార్థులపై ప్రభావం
- 10వ తరగతి మ్యాథ్య్, ప్లస్2 ఎకనామిక్స్ పేపర్స్ లీక్
- వాట్సాప్ లో పెద్ద ఎత్తున షేర్ అయిన క్వశ్చన్ పేపర్స్
- రీఎగ్జామ్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించిన సీబీఎస్ఈ
ప్లస్2 ఎకనామిక్స్ పరీక్ష సోమవారం జరగ్గా, 10వ తరగతి మ్యాథ్స్ ఎగ్జామ్ ఈరోజు జరిగింది. చేతితో రాసిన ఎకనామిక్స్ పేపర్ వాట్సాప్ లో భారీ ఎత్తున సర్క్యులేట్ అయింది. ఈ లీకులో వచ్చిన అనేక ప్రశ్నలు క్వశ్చన్ పేపర్ లో ఉన్నాయి. మార్చ్ 5 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు జరుగుతున్నాయి. సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయం ప్రభావం 10వ తరగతి, 12వ తరగతికి చెందిన 28 లక్షల మందికి పైగా విద్యార్థులపై పడనుంది.