manikyala rao: సినీ హీరో శివాజీపై ఏపీ డీజీపీకి మాజీ మంత్రి మాణిక్యాలరావు ఫిర్యాదు

  • ఆపరేషన్ ద్రవిడ పేరుతో ఓ జాతీయ పార్టీ భారీ కుట్ర చేస్తోందని శివాజీ ఆరోపణలు
  • అభ్యంతరం వ్యక్తం చేసిన మాణిక్యాలరావు
  • చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

సినీనటుడు, ప్రత్యేక హోదా సాధన సమితి నేత శివాజీ ఇటీవల ఓ జాతీయ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దక్షిణాదిన ఓ జాతీయ పార్టీ కుట్ర పన్నిందని తెలుగు రాష్ట్రాల్లో ఆపరేషన్ ద్రవిడ పేరుతో ఇతర పార్టీలను బలహీనపరుస్తుందని ఆయన అన్నారు. ఆయన ఆరోపణలపై బీజేపీ నేత, ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు అభ్యంతరం వ్యక్తం చేశారు. శివాజీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ రోజు ఆయన ఏపీ డీజీపీ మాలకొండయ్యను కలిశారు. శివాజీ ఆపరేషన్‌ ద్రవిడ అంటూ ఓ వీడియో విడుదల చేశారని దాన్ని పరిశీలించి కేసు నమోదు చేయాలని డీజీపీని కోరారు.  

More Telugu News