akash: యూత్ ను ఊరిస్తోన్న 'మెహబూబా' రిలీజ్ డేట్

  • ఆకాశ్ పూరీ హీరోగా 'మెహబూబా'
  • యూత్ లో పెరుగుతోన్న ఆసక్తి 
  • మే 11వ తేదీన భారీస్థాయిలో రిలీజ్

లవ్ కి యాక్షన్ ను .. ఎమోషన్ ను జోడించి దానిని అద్భుతంగా తెరపై ఆవిష్కరించడంలో పూరీ జగన్నాథ్ సిద్ధహస్తుడు. తాజాగా ఆయన తన తనయుడు ఆకాశ్ తో 'మెహబూబా' సినిమా చేశాడు. 1971 ఇండియా ..  పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో నడిచే ప్రేమకథ ఇది. ఈ మధ్యనే షూటింగును పూర్తి చేసుకున్న ఈ సినిమా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది.

 ఈ సినిమా కోసం యూత్ అంతా కూడా ఎంతో ఆసక్తితో .. ఆత్రుతతో ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను మే 11వ తేదీన విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చేశారు. పూరీ తన సొంతబ్యానర్ పై ఈ సినిమాను నిర్మించాడు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేసే హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నాడు. దాంతో ఈ సినిమా కంటెంట్ లో బలమైన విషయమే ఉందని భావిస్తున్నారు. ఈ సినిమాతో హీరోగా ఆకాశ్ నిలబడిపోతాడేమో చూడాలి.

More Telugu News