Jammu And Kashmir: అనంత్ నాగ్ లో ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టిన భద్రతా సిబ్బంది

  • శిస్త్రాగమ్ లో కార్డన్ సెర్చ్ నిర్వహించిన భద్రతా సిబ్బంది
  • ఓ ఇంట్లో దాగి ఉన్న ముష్కరులు..భద్రతా సిబ్బందిపై కాల్పులు
  • ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్మూకాశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా సిబ్బంది మట్టుబెట్టారు. అనంత్ నాగ్ లోని శిస్త్రాగమ్ గ్రామంలో ఈ రోజు ఉదయం భద్రతా సిబ్బంది కార్డన్ సెర్చ్ చేపట్టింది. ఈ క్రమంలో ఓ ఇంట్లో దాక్కున్న ముష్కరులు భద్రతా సిబ్బందిపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో, భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులకు పాల్పడడంతో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు భద్రతా సిబ్బంది తెలిపారు.

More Telugu News